Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులకు గులాబీ రంగు!

తెలంగాణా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులకు గులాబీ రంగు!
, గురువారం, 23 అక్టోబరు 2014 (11:06 IST)
తెలంగాణ రాష్ట్రంలో తిరిగే అన్ని ఆర్టీసీ బస్సులకు రంగు మారుతోంది. ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన తెరాస జెండా రంగు గులాబీని వేయనున్నారు. రాష్ట్రంలో త్వరలోనే బస్సుల రంగును మార్చనున్నట్టు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
అలాగే, తెలంగాణ ఆర్టీసీకి కొత్త లోగోను కూడా సిద్ధం చేశారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు కూడా బస్సులు నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు గులాబీ కోటింగ్ వేయనున్నారు. అలాగే, 'పల్లెవెల్లుగు' బస్సులను 'గ్రామరథం'గా పేరు మార్చనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu