ఎమ్మెల్యేలు వివేకానంద, రాజేందర్ రెడ్డిలు తెలుగు దేశం పార్టీ వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరడం తనకు బాధను కలిగించిందని టీటీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి తెలిపారు. కష్టాల్లో ఉన్న సమయంలో స్వార్థ రాజకీయాల కోసం వారు పార్టీని వీడారని విమర్శించారు. స్వార్థపరులు వెళితే, ఫీలవాల్సిన అవసరం లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని, కిందిస్థాయి నేతలు పైకెదిగే అవకాశాలిప్పుడు పుష్కలమన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండవచ్చుగానీ, ఎల్లకాలమూ ఉండదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికష్టాలైనా పడతానే తప్ప, తాను పార్టీని వదిలే సమస్యే లేదని కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు లేఖ రాశారు.