Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేవంత్ రెడ్డి వార్నింగ్ : మేం తలచుకుంటే టి భవన్ ఆనవాళ్లు ఉండవ్!

రేవంత్ రెడ్డి వార్నింగ్ : మేం తలచుకుంటే టి భవన్ ఆనవాళ్లు ఉండవ్!
, బుధవారం, 22 అక్టోబరు 2014 (18:41 IST)
తెలంగాణాలోని టీడీపీ కార్యకర్తలు తలచుకుంటే హైదరాబాద్‌లో తెలంగాణ భవన్ ఆనవాళ్లు ఉండవని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాగే, నల్గొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి జిల్లా ఎస్పీ ప్రభాకరరావు సహకారంతోనే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిప్పు పెట్టారని ఆయన ఆరోపించారు. 
 
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ ప్రభాకరరావు తీరుపై అసెంబ్లీలో చర్చిస్తామని అన్నారు. ఏం నేరం చేశారని మాధవరెడ్డి చిత్ర పటాన్ని తగులబెట్టారని రేవంత్ రెడ్డి నిలదీశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేయించి టీ. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళుతున్న టీడీపీ నేతలను, కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమని ఆయన అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu