రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. ఖరీదైన వ్యభిచారం సాగిస్తున్న ఏడుగురు మహిళలతో సహా ఐదుగురు పురుషులను అరెస్టు అయ్యారు. అమ్మాయిలను బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. వారితో కాస్ట్లీ వ్యభిచారం నడుపుతున్నారు.
దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పోలీసులు గురువారం అంబర్పేటలోని చైనాంబర్లో ఒక ఇంటిపై అకస్మాత్తుగా దాడి చేసిన పోలీసులు ఇద్దరు మహిళలను, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా నల్లకుంటలోని బాయమ్మ వీధిలో వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు బంగ్లాదేశ్కు చెందిన మహిళలను, నలుగురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం విటులను అంబర్పేట పోలీస్స్టేషన్కు తరలించారు. బంగ్లాదేశ్కు చెందిన మహిళలపై ఇండియన్ పాస్పోర్టు ఎంట్రీయాక్టు-1929 ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ రెండు సంఘటనలు గృహ నివాస ప్రాంతంలో జరగడంతో కలకలం రేగింది.