Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖమ్మంలో విద్యార్థినిపై రేప్ ... వీడియో తీసి ఫ్రెండ్స్‌కు షేరింగ్...

ఖమ్మంలో విద్యార్థినిపై రేప్ ... వీడియో తీసి ఫ్రెండ్స్‌కు షేరింగ్...
, శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (21:21 IST)
ప్రేమ పేరిట కొందరు నయవంచకులు చేస్తున్న దారుణాలకు అబలలు బలవుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఓ యువకుడు ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో వంచించి వేధింపులకు దిగాడు. వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఫార్మసీ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినిని హుస్సేన్ అలీ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటబడి ఆమెను లోబరుచుకున్నాడు. 
 
ఆమెకు మాయమాటలు చెప్పి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి ఆమెను లొంగదీసుకున్నాడు. వాటి తాలూకు దృశ్యాలను యువతికి తెలియకుండా సెల్ ఫోన్‌లో చిత్రీకరించడమే కాకుండా వాటిని తన ముగ్గురు స్నేహితులకు షేర్ చేశాడు. ఆ ముగ్గురు కూడా యువతిని బ్లాక్‌మెయిల్ చేస్తూ నాలుగు నెలల పాటు ఆమెపై అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు.
 
ఇలా క్రూరంగా హింసించిన హుస్సేన్ తాను తీసిని వీడియోను మరొకరికి విక్రయించడంతో ఆ వ్యక్తి కూడా ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆ మానసిక వేదనను భరించలేని యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఐతే ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెకు జరిగిన అన్యాయానికి తట్టుకోలేక వారు కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.ఆసుపత్రిలో వారు కోలుకుంటున్నారు. 
 
బాధితురాలు తన స్నేహితుడు, బంధువుల సాయంతో అఘాయిత్యానికి పాల్పడ్డ వారిపై కేసు పెట్టింది. గత వారం రోజులుగా నిందితుల కోసం వేటాడిన పోలీసులు హుస్సేన్, సునీల్, రెహ్మాన్ లను పట్టుకున్నారు. మనోజ్ అనే మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. నిందితులపై 376, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu