Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీలో నరసింహన్ : హైదరాబాద్‌ అధికారాలపైనే మంతనాలా?

ఢిల్లీలో నరసింహన్ : హైదరాబాద్‌ అధికారాలపైనే మంతనాలా?
, గురువారం, 21 ఆగస్టు 2014 (10:04 IST)
దేశ రాజధాని ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ బిజీబిజీగా గడుపుతున్నారు. తన తొలి రోజు పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, న్యాయశాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్‌లతో ఆయన సమావేశమై చర్చలు జరిపారు. ఈ భేటీల్లో ప్రధానంగా హైదరాబాద్‌లో తన అధికారాలపైనే నరసింహన్ మంతనాలు సాగించినట్టుగా చెపుతున్నారు. 
 
ముఖ్యంగా.. తెలంగాణలో పరిస్థితులు, హైదరాబాద్‌లో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టంలో కల్పించిన అంశాలపై ఆయన సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. రెండో రోజైన గురువారం షెడ్యూల్‌లో ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆయన కలుసుకోనున్నారు. ఈ భేటీ తర్వాత పరిస్థితిలో స్పష్టత ఏర్పడొచ్చని విశ్వసనీయవర్గాల సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu