తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై టీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోమారు విరుచుకపడ్డారు. నిరంకుశత్వ పాలనతో ప్రజలకు నరకం చూపిన నిజాం నవాబు ఇపుడు కేసీఆర్ రూపంలో తెలంగాణా రాష్ట్రంలో బతికొచ్చినట్టున్నారని ఎద్దేవా చేశారు.
ఎవరు మెచ్చుకోని నిజాంను గొప్పవాడిగా కీర్తించిన ఘనత ఒక్క కేసీఆర్దేనని, ఇపుడు కేసీఆర్ కూడా నిజాం నవాబు తరహాలో దళితులు, ఇతర వర్గాలను అణచివేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రివర్గంలో దళితులకు, మహిళలకు స్థానం కల్పించకుండా నిరంకుశ ధోరణితో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ప్లీనరీ ద్వారా వారికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.