Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పటాన్ చెరులో కాంగ్రెస్ తొలి విజయం: 13 డివిజన్లలో ఎంఐఎం గెలుపు

పటాన్ చెరులో కాంగ్రెస్ తొలి విజయం: 13 డివిజన్లలో ఎంఐఎం గెలుపు
, శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (17:48 IST)
పటాన్ చెరు డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ మొదటి ఓట్ల లెక్కింపులోనే తొలి విజయం నమోదు చేసుకుంది. తద్వారా గ్రేటర్ ఎన్నికల్లో తొలి విజయం నమోదు చేసుకున్నట్లైంది. పటాన్ చెరు డివిజన్ లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన మెట్టు శంకర్ యాదవ్ గెలుపొందారు. ఇక బీజేపీ, టీడీపీ పార్టీలు 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అక్బర్ బాగ్ నుంచి స్వతంత్ర్య అభ్యర్థి ఒకరు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
ఇకపోతే గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 13 డివిజన్లలో ఇప్పటివరకు గెలుపును నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలోని మజ్లిస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరో 8 డివిజన్లలో ఎంఐఎం అధిక్యత కొనసాగుతోంది. లిలిత్ బాగ్, రియాసత్ నగర్, డబీర్ పురా, అక్బర్ బాగ్, ఫలక్ నుమా, నవాబ్ సాహెబ్ కుంట, శాలిబండ, అహ్మద్ నగర్, విజయ్ నగర్ కాలనీతో పాటు మరో నాలుగు డివిజన్లలో ఎంఐఎం అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై గెలుపు నమోదు చేసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu