Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హల్లో కేసీఆర్.. నీ నేటివిటీ ఏంటి : కిషన్ రెడ్డి ప్రశ్న!

హల్లో కేసీఆర్.. నీ నేటివిటీ ఏంటి : కిషన్ రెడ్డి ప్రశ్న!
, శుక్రవారం, 1 ఆగస్టు 2014 (14:42 IST)
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె చంద్రశేఖర్ రావుపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో టీ రాష్ట్ర ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. 
 
ఈ నిర్ణయం విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తుందన్నారు. 1956 స్థానికత నేపథ్యంలో కేసీఆర్ తన గ్రామంలో సర్టిఫికెట్ తెచ్చుకోగలడా అని సూటిగా ప్రశ్నించారు. దాంతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులే నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం పరిపక్వతతో ఆలోచించాలని హితవు పలికారు. ఒక ఉద్యమనాయకుడైన కేసీఆర్‌కు పరిపాలనా అనుభవం ఏమాత్రం లేదని తేటతెల్లమవుతోందని ఆయన విమర్శించారు. 

Share this Story:

Follow Webdunia telugu