తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సర్కారు విస్మరించిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఉద్యమాల అండతో అధికారంలోకి వచ్చిన పార్టీ... ఉద్యమ నేతను ఎలా మర్చిపోయిందని ప్రశ్నించారు.
తెలంగాణ కోసం బలిదానం చేసిన వారిని, ఉస్మానియా విద్యార్థులను, ఉద్యోగ సంఘాల పాత్రను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ జతకట్టడం అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని చెప్పారు. రూ.లక్షల కోట్లు మింగేసిన కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే ప్రజలు కనుమరుగు చేశారని తెలిపారు.