Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టిలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానం : కేసీఆర్

టిలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానం : కేసీఆర్
, మంగళవారం, 22 జులై 2014 (15:55 IST)
చిత్తశుద్ధితో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇందుకోసం సింగపూర్ తరహాలో సింగిల్ విండో విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించారు. మంగళవారం గ్రాండ్ కాకతీయలో నూతన పారిశ్రామిక విధానంపై ఆయన పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. మూడు లక్షల ఎకరాలు పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు.  
 
సింగపూర్ తరహాలో సింగిల్ విండో సిస్టం ఏర్పాటు చేస్తామని, 24 గంటల కరెంట్, 10 శాతం నీరు పరిశ్రమలకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పూర్తి పారదర్శకంగా నూతన పారిశ్రామిక విధానం ఉంటుందని, కొత్త పారిశ్రామిక విధానంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. పారిశ్రామికవేత్తలను శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా సీఎంవోకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
 
పరిశ్రమల ఏర్పాటులో త్వరితగతిన అనుమతుల మంజూరు కోసం ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అన్నింటికి 21రోజుల్లోగా అనుమతులు ఉంటాయని, ఒకట్రెండు తప్ప అన్ని అనుమతులు ఒకే రోజున, ఒకో చోట మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రతి సాగునీటి ప్రాజెక్టులో పది శాతం నీటిని పరిశ్రమలకు కేటాయించారు. పరిశ్రమల అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధే లక్ష్యమన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu