Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రా వెళ్లి ప్రజల వెంటబడి చావు... పో... చంద్రబాబుపై కేసీఆర్ ఫైర్

ఆంధ్రా వెళ్లి ప్రజల వెంటబడి చావు... పో... చంద్రబాబుపై కేసీఆర్ ఫైర్
, సోమవారం, 27 ఏప్రియల్ 2015 (20:27 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టని చంద్రబాబు ఇక్కడ నన్ను... కేసీఆర్... నిన్ను నిద్రబోనియ్య, అంటుండు. చంద్రబాబు మాటలు చూస్తుంటే కన్నతల్లికి అన్నం పెట్టనివాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నడట... అన్నట్లుగా ఉంది. నీ రాష్ట్రంలో దిక్కులేదు, ఇక్కడకొచ్చి నన్ను నిద్రబోనియ్య, నన్ను నిద్రబోనియ్య అనడం కాదు, ఆంధ్రా వెళ్లి అక్కడ ప్రజల వెంటబడి చావు పో... అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
అయినా ఇక్కడేముందని బాబు ఇక్కడకి వస్తుండు... ఇక్కడ నుంచి ఛీ పో అన్నాగానీ పోడట. ఆయనకు రాష్ట్రం ఉంది.... రాజధాని ఉంది... ఆ రాజధానికి సమస్యలు ఉన్నాయి. ఏపీలో ప్రజలకు ఎన్నో చేస్తామని చెప్పిండు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని వారికి సబ్బు పెట్టిండు. రైతుల రుణమాఫీ సరేసరి అంటూ కడిగిపారేశారు. తన వ్యవహారం అలా కాదనీ, మాట ఇస్తే తలతెగిపడినా వెనక్కిపోయే ప్రశ్నే లేదంటూ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu