Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాడ్జీలో రాసలీలలు : పట్టుబడిన సీఐ - ఎస్‌ఐలపై సస్పెన్షన్ వేటు!

లాడ్జీలో రాసలీలలు : పట్టుబడిన సీఐ - ఎస్‌ఐలపై సస్పెన్షన్ వేటు!
, గురువారం, 20 నవంబరు 2014 (09:58 IST)
ఇటీవల అసెంబ్లీ బందోబస్తు విధుల నిమిత్తం హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ లాడ్జీలో రాసలీలల్లో మునిగిపోయిన సీఐ స్వామి, మహిళా ఎస్సై రాజ్యలక్ష్మిలపై చేపట్టిన శాఖారపమైన చర్యల్లో భాగంగా తొలుత సస్పెన్షన్ వేటు పడింది. గతవారం వెలుగు చూసిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసు బాసులు ఇప్పటికే ఆ ఇధ్దరు అధికారులపై బదిలీ వేటు వేయగా, తాజాగా సస్పెండ్ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 
 
అసెంబ్లీ బందోబస్తు కోసం వచ్చిన కరీంనగర్ త్రీ టౌన్ సీఐ స్వామి, వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై రాజ్యలక్ష్మి... హైదరాబాదులోని ఓ లాడ్జీలో రాసలీలల్లో మునిగి ఉండగా, మహిలా ఎస్సై భర్తే స్వయంగా పోలీసులకు సమాచారమిచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడేలా చేశారు. 
 
ఇరువురు అధికారులకు వేర్వేరు లాడ్జీల్లో బస ఏర్పాటు చేసినా, వారు మాత్రం ఒకే లాడ్జీలో దూరి రాసలీలల్లో మునిగిపోయారు. ఎస్సై భర్త ఫిర్యాదు మేరకు వారిద్దరిపై నగర పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu