Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు ఆహ్వానిస్తే టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధం : జగ్గారెడ్డి

చంద్రబాబు ఆహ్వానిస్తే టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధం : జగ్గారెడ్డి
, బుధవారం, 23 జులై 2014 (08:54 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఆహ్వానిస్తే తాను టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు తనను కలిసిన సంగారెడ్డి టీడీపీ మహిళా నేతకు ఆయన స్పష్టం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
తెలంగాణాలో టీడీపీని మరింత బలపేతం చేసేందుకు చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో ప్రజాకర్షణ ఉన్న ముఖ్యనాయకులపై ఆయన దృష్టి పెట్టారు. టీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కోనేందుకు మాస్ ఇమేజ్ ఉన్న లీడర్లను తమ పార్టీలోకి ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
 
చంద్రబాబు సూచన మేరకు మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శశికళ బుధవారం జగ్గారెడ్డిని సంప్రదించారు. చంద్రబాబు స్వయంగా ఆహ్వానిస్తే టీడీపీలో చేరేందుకు సిద్ధమని జగ్గారెడ్డి శశికళకు స్పష్టం చేసినట్టు సమాచారం. 2019లో టీడీపీని తెలంగాణాలో అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ కు క్రమంగా దూరమవుతున్న రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తమ వైపుకు తిప్పుకోవాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu