Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడిపై వ్యామోహం.. కుమార్తెను హత్య చేసిన తల్లి!

ప్రియుడిపై వ్యామోహం.. కుమార్తెను హత్య చేసిన తల్లి!
, గురువారం, 31 జులై 2014 (10:37 IST)
కట్టుకున్న భర్త కంటే.. ప్రియుడిపై వ్యామోహం ఎక్కువ కావడంతో కంటికి కన్న కుమార్తె అని విషయాన్ని కూడా మరచిపోయి.. ఓ మహిళ అఘాత్యానికి పాల్పడింది. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లిలో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
నల్లగొండ జిల్లా పెద్దవూర అనే ప్రాంతానికి చెందిన చంద్రకళ అనే 21 ఏళ్ల మహిళ ఎనిమిదేళ్ల క్రితం వి. హనుమంత (40) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు కృష్ణవేణికి నాలుగేళ్లు. ఇదే ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల రమావత్ వెంకటితో వైవాహిక సంబంధం ఏర్పడింది. 
 
అయితే, ఇటీవల హనుమంత నార్కెట్‌పల్లికి వచ్చి స్థిరపడ్డాడు. దాంతో వెంకటిని కలుసుకోవడం చంద్రకళకు ఇబ్బందిగా మారింది. కృష్ణవేణిని చంపేయాలని వెంకటి శుక్రవారం చంద్రకళకు చెప్పాడు. చంద్రకళ కూతురిని బయటకు తీసుకుని వెళ్లి చంపేసింది. కూతురి గొంతు నులిమి చంపిన చంద్రకళ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని చెప్పింది. చంద్రకళ నేరాన్ని అంగీకరించింది. ఆమెతో పాటు వెంకటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu