Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెరాసలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట

తెరాసలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట
, గురువారం, 28 మే 2015 (18:11 IST)
నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది.
 
త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అనుమతించవద్దంటూ టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ వేర్వేరుగా హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు వీటిని తోసిపుచ్చింది.
 
ఇలాంటి సమయంలో ఈ పిటీషన్‌పై తాము జోక్యం చేసుకోలేమని పిటిషనర్లకు కోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, కాలె యాదయ్య, రెడ్యా నాయక్, విఠల్‌రెడ్డి, కనకయ్య తమ ఓటు హక్కును వినియోగించు కోవచ్చని స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu