హైదరాబాద్కి చెందిన సాయివర్మ అనే నాలుగేళ్ళ బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. హైదరాబాద్లోని చింతల్ ప్రాంతానికి చెందిన కోమలాదేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిని పరామర్శించడానికి సాయివర్మను తీసుకుని ఆమె కుమారుడు నిషాంత్ ఈనెల 11వ తేదీన ఖమ్మం వెళ్లాడు.
కోమలాదేవి ఆస్పత్రిలో నిషాంత్ చూస్తుండగా, సాయివర్మ ఆస్పత్రి నుంచి ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి బాలుడి కోసం తల్లిదండ్రులు గాలిస్తూ వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఖమ్మం శివారులోని రఘునాథపాలెం మండలం బలాపేట ప్రాంతంలోని ముళ్ల పొదల్లో కుళ్ళిపోయిన స్థితిలో సాయివర్మ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.