Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐదు కేజీల బంగారు గాజులా.. ఓలమ్మో.. ఓరబ్బో....!

ఐదు కేజీల బంగారు గాజులా.. ఓలమ్మో.. ఓరబ్బో....!
, బుధవారం, 23 జులై 2014 (14:44 IST)
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నవారిని పట్టుకోవడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. గత యేడాది అక్టోబరు నెల నుంచి డిసెంబరు నెలాఖరు వరకు దాదాపు 20 కోట్ల రూపాయల విలువైన 62 కిలోల బంగారాన్ని విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత విమానాశ్రయంలో నిఘాను మరింత పటిష్టం చేశారు.
 
అయినప్పటికీ.. బంగారు అక్రమ రవాణా ఏమాత్రం తగ్గలేదు. గత వారం కేజీ బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకోగా, తాజాగా బుధవారం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు మహిళల నుంచి సుమారు ఐదు కిలోల బంగారు గాజులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని తెచ్చిన మహిళలను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 
 
 

Share this Story:

Follow Webdunia telugu