Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పుడేమో గొప్పులు చెప్పుకున్నారు.. ఇప్పుడు మోసం చేస్తున్నారు!

అప్పుడేమో గొప్పులు చెప్పుకున్నారు.. ఇప్పుడు మోసం చేస్తున్నారు!
, బుధవారం, 7 అక్టోబరు 2015 (18:53 IST)
ఎన్నికల్లో గెలిచి తీరాలనే ఉద్దేశంతో అప్పుడేమో గొప్పలు చెప్పుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రస్తుతం విడతలవారిగా రుణాలను మాఫీ చేస్తామని మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శలు గుప్పించారు. అప్పులను తీర్చలేకే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో అమలు చేయడానికి వీలు కానటువంటి హామీలను ఇచ్చి.. వాటిని అమలు చేయడంలో మాత్రం కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రదర్శించడంలేదని మండిపడ్డారు. 
 
అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. లక్ష రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న కేసీఆర్ మాటల్ని నమ్మిన ప్రజలు.. రుణాలు మాఫీ కాకపోవడంతో అప్పులను తీర్చలేకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ నేతలు ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్తారన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu