Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రేటర్ హైదరాబాదులో కరోనా పంజా.. 50 లక్షల మందికి జలుబు, జ్వరం

గ్రేటర్ హైదరాబాదులో కరోనా పంజా.. 50 లక్షల మందికి జలుబు, జ్వరం
, మంగళవారం, 18 మే 2021 (11:49 IST)
కరోనా తెలంగాణలో విజృంభిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాదులో కోవిడ్ పంజా విసురుతోంది. ఇంకా గ్రేటర్‌ హైదరాబాద్‌లో జ్వరం సర్వే మొదలైంది. మే 16నాటికి 8.5 లక్షల ఇళ్ళ పరిశీలన పూర్తయ్యింది. నిత్యం సుమారు 1700 బృందాలు సర్వే చేస్తున్నాయి. ప్రతి 100 ఇళ్ళల్లో పది మందికి పైగా జలుబు, దగ్గు వంటి లక్షణాలతో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా 50 లక్షల మంది ప్రజలు జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. 
 
క్షేత్రస్థాయిలో వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సత్ఫలితాలు ఇస్తున్నప్పటికీ.. జ్వరం సర్వేలో ఇప్పటికే 52 వేల మంది వ్యాధి లక్షణాలతో కనిపించడం ఆందోళనకు తావిస్తోంది. 
 
అందులో చిన్నారులు, యువత ఎక్కువగా ఉన్నారు. జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడుతున్నారు. అందుకు వాతావరణ మార్పులు కారణం కావొచ్చని వైద్యుల అంచనా. 
 
ముక్కు కారడం, పొడి దగ్గు, విరేచనాలతో బాధపడుతున్న వారికి యంత్రాంగం కరోనా కిట్లు అందజేస్తోంది. కట్టడి చర్యలు అమలు చేస్తోంది. నాలుగైదు రోజులకు వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టకపోతే దగ్గర్లోని ప్రభుత్వ దవాఖానాను సంప్రదించాలని ఆశా కార్యకర్తలు బాధితులకు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ రోగుల్లో నిస్సత్తువ పోవాలంటే...