Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌లో పని సామర్థ్యం ఎక్కువ.. నైపుణ్యత తక్కువ.. చైనా 100 శాతం?: బండారు

ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో పని సామర్థ్యం ఉన్నా.. నైపుణ్యత కలిగిన వారు చాలా తక్కువని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మన దేశంలో 50కోట్ల మంది పని సామర్థ్యం కలిగిన వారున్నా... అందులో కేవలం

భారత్‌లో పని సామర్థ్యం ఎక్కువ.. నైపుణ్యత తక్కువ.. చైనా 100 శాతం?: బండారు
, ఆదివారం, 19 జూన్ 2016 (15:37 IST)
ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో పని సామర్థ్యం ఉన్నా.. నైపుణ్యత కలిగిన వారు చాలా తక్కువని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మన దేశంలో 50కోట్ల మంది పని సామర్థ్యం కలిగిన వారున్నా... అందులో కేవలం 5శాతం మంది మాత్రమే నైపుణ్యత కలిగిన వారున్నారని బండారు క్లారిటీ ఇచ్చారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని పేర్కొన్నారు. 
 
జపాన్‌లో 75శాతం, దక్షిణ కొరియాలో 90శాతం, చైనాలో వందశాతం మంది నైపుణ్యత కలిగిన వారుంటే.. మన దేశంలో 50 కోట్లమంది పని సామర్థ్యం కలిగివున్నా.. ఐదు శాతం మాత్రమే నైపుణ్యత కలిగివున్నారని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.
 
నైపుణ్యత పెంపుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయంలో పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఏర్పాటుచేసిన నైపుణ్యత పెంపుదల శిక్షణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. విద్యార్హతల కంటే కూడా వాక్చాతుర్యం, భాషలో పట్టు ఉన్నవారు ఎందులో అయినా రాణిస్తారని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనియా గాంధీ విధేయుల్ని టార్గెట్ చేసిన సుబ్రహ్మణ్య స్వామి.. ట్వీట్టర్లో..?!