Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోడ్డు ప్రమాదంలో నా కొడుకు చనిపోయినప్పుడు సూసైడ్ చేసుకుందామనుకున్నా... బాబూ మోహన్

తమ పిల్లలు కాలు కింద పెట్టకూడదనీ, దర్జాగా మహరాజులా బతకాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అందుకే వారు ఏది అడిగితే అది కాదనకుండా, వారి శక్తిమేరకు అన్నీ సమకూరుస్తున్నారు. ఇలాంటి వాటిలోనే కార్లు, రేసింగ్

రోడ్డు ప్రమాదంలో నా కొడుకు చనిపోయినప్పుడు సూసైడ్ చేసుకుందామనుకున్నా... బాబూ మోహన్
, బుధవారం, 10 మే 2017 (19:54 IST)
తమ పిల్లలు కాలు కింద పెట్టకూడదనీ, దర్జాగా మహరాజులా బతకాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అందుకే వారు ఏది అడిగితే అది కాదనకుండా, వారి శక్తిమేరకు అన్నీ సమకూరుస్తున్నారు. ఇలాంటి వాటిలోనే కార్లు, రేసింగ్ బైకులు కూడా వుంటున్నాయి. ఇలాంటి వాహనాలతోనే కొందరు పిల్లలు తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. 
 
గతంలో కోట శ్రీనివాస రావు కుమారుడు, హాస్య నటుడు, ఎమ్మెల్యే బాబూ మోహన్ కుమారుడు ఇలా అతివేగంగా వాహనాన్ని నడిపి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మంత్రి నారాయణ కుమారుడు కూడా అత్యంత వేగంతో కారును నడిపి ప్రాణాలు కోల్పోయారు. తండ్రి బిడ్డను కోల్పోతే అనుభవించే నరకం ఎలాంటిదో బాబూ మోహన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 
 
తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు తాను కూడా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాననీ, ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఏడ్చేవాడిననీ, ఆ సమయంలో ఈవీవి సత్యనారాయణ తన మనసు మార్చి ఓదార్చారన్నారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఎవడిగోల వాడిది చిత్రం కోసం అక్కడికి తీసుకెళ్లి తనకు మనశ్శాంతి కల్గించాడనీ, ఆ రోజు ఇవివి సత్యనారాయణ అలా చేయకపోతే తను వుండేవాడిని కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి నారాయణ కుమారుడు మృతికి స్పీకర్ కోడెల సంతాపం