Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కసాయి భర్త: భార్యను కొట్టి.. పురుగుల మందు తాగించి హత్య

కసాయి భర్త: భార్యను కొట్టి.. పురుగుల మందు తాగించి హత్య
, శుక్రవారం, 27 మార్చి 2015 (06:05 IST)
మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడో తనకే అర్థకానీ స్థితి.. జీవితాంతం తోడుంటానని ప్రమాణంచేసిన భర్తే చితకబాదాడు. ఆపై ఇంట్లోని పురుగుల మందు తీసుకొచ్చి బలవంతంగా తాగించాడు. ఆమెను హత్య చేశాడు. పిల్లలు అనాథలుగా మిగిలారు. ఆయనే కటకటాల పాలయ్యాడు. ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
 
ఖమ్మం జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను మద్యం మత్తులో చితకబాది, పురుగుల మందు తాగించి హత్య చేశాడు ఓ కసాయి భర్త. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం, పడమట నర్సాపురం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..  ఆ గ్రామానికి చెందిన బూరుగు నర్సమ్మ(32), ముక్తేశ్వరరావు భార్యాభర్తలు. 
 
ముక్తేశ్వర రావు బుధవారం రాత్రి మద్యం తాగి భార్యను కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె నోట్లో పురుగుమందు పోశాడు. కొన ఊపిరితో ఉన్న నర్సమ్మను స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఆమె మరణించింది. దీంతో ఆగ్రహించిన నర్సమ్మ తరపు బంధువులు ముక్తేశ్వరరావుకు దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Share this Story:

Follow Webdunia telugu