AI వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ వీడియోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. అవి వాస్తవమైనవో అవాస్తవమైనవో తెలుసుకునేందుకు Grokని సంప్రదించాల్సి వస్తుంది. ఈ విషయం అలా వుంచితే కొన్ని వీడియోలు వినోదాత్మకంగా, ఆరోగ్యకరంగా వుంటున్నాయి.
ఇకపోతే సంక్రాంతి సందర్భంగా మాయాబజార్ అనే పేరుతో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైసిపి అధ్యక్షుడు జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంతా కలిసి సంక్రాంతి పండుగను చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చూడండి.