Webdunia - Bharat's app for daily news and videos

Install App

BRS: కాంగ్రెస్ నేత వేధింపులు.. టెర్రస్‌పై నుంచి దూకి బీఆర్ఎస్ కార్మికుడు ఆత్మహత్య

సెల్వి
గురువారం, 29 మే 2025 (11:14 IST)
భవన నిర్మాణ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడానికి డబ్బు డిమాండ్ చేసిన మాజీ డిప్యూటీ మేయర్, కాంగ్రెస్ నాయకుడు బాబా ఫసియుద్దీన్ వేధింపుల కారణంగా ఒక బీఆర్ఎస్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. మొహమ్మద్ సర్దార్ (50) తన కుటుంబంతో కలిసి బోరబండలో నివసిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం, అతను ఒక ఇంటిని నిర్మించాడు. కొన్ని ఉల్లంఘనల కారణంగా GHMC దానిని కూల్చివేసింది. ఆపై భవన నిర్మాణ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడానికి బాబా ఫసియుద్దీన్ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. అతని నుంచి వేధింపులు రోజు రోజుకు ఎక్కువ కావడంతో..  బుధవారం రాత్రి సర్దార్ ఒక భవనం టెర్రస్ పైకి వెళ్లి అక్కడి నుంచి నేలపైకి దూకాడు. ఈ ఘటనలో అతడు గాయపడి అక్కడికక్కడే మరణించాడు.
 
సర్దార్ భవనంపైకి ఎక్కి అక్కడి నుంచి దూకాడని డీసీపీ టాస్క్ ఫోర్స్ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని సుధీంద్ర  తెలిపారు. 
 
బాబా ఫసియుద్దీన్ బాధితుడిని క్రమం తప్పకుండా వేధించేవాడని, ఆ తర్వాత అతను నిరాశకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని సర్దార్ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments