ట్వంటీ-20 ప్రపంచకప్ పోటీల్లో భాగంగా మంగళవారం శ్రీలంక- న్యూజీలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో లంకేయులు 48 పరుగుల తేడాతో కివీస్ను ఓడించారు. 17 ఓవర్లలో కేవలం 105 పరుగులకే న్యూజీలాండ్ను పెవిలియన్ ముఖం పట్టించారు. దీంతో శ్రీలంక ఆ గ్రూపులో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.
శ్రీలంక బౌలర్లు అద్భుతంగా రాణించడంతో న్యూజీలాండ్ బ్యాట్సమన్లు పరుగులు తీయడానికి నానా తంటాలు పడ్డారు. శ్రీలంక బౌలర్ అజంతా మెండిస్ మూడు ఓవర్లలో కేవలం 9 పరుగులిచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి న్యూజీలాండ్ నడ్డి విరిచాడు.
దీంతో న్యూజీలాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండంకెల స్కోరును కేవలం ముగ్గురు బ్యాట్సమన్లు మాత్రమే చేయగలిగారు. మిగిలినవారంతా లంకేయుల బౌలింగ్ ధాటికి తలవంచి పెవిలియన్ ముఖం పట్టారు.