Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ పరాజయం

శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ పరాజయం
ట్వంటీ-20 ప్రపంచకప్ పోటీల్లో భాగంగా మంగళవారం శ్రీలంక- న్యూజీలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో లంకేయులు 48 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించారు. 17 ఓవర్లలో కేవలం 105 పరుగులకే న్యూజీలాండ్‌ను పెవిలియన్ ముఖం పట్టించారు. దీంతో శ్రీలంక ఆ గ్రూపులో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

శ్రీలంక బౌలర్లు అద్భుతంగా రాణించడంతో న్యూజీలాండ్ బ్యాట్సమన్లు పరుగులు తీయడానికి నానా తంటాలు పడ్డారు. శ్రీలంక బౌలర్ అజంతా మెండిస్ మూడు ఓవర్లలో కేవలం 9 పరుగులిచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి న్యూజీలాండ్ నడ్డి విరిచాడు.

దీంతో న్యూజీలాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండంకెల స్కోరును కేవలం ముగ్గురు బ్యాట్సమన్లు మాత్రమే చేయగలిగారు. మిగిలినవారంతా లంకేయుల బౌలింగ్ ధాటికి తలవంచి పెవిలియన్ ముఖం పట్టారు.

Share this Story:

Follow Webdunia telugu