Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్వంటీ-20 టోర్నీ: సూపర్-8కు పాకిస్థాన్

ట్వంటీ-20 టోర్నీ: సూపర్-8కు పాకిస్థాన్
సూపర్-8కు పాకిస్థాన్ దూసుకెళ్లింది. చావోరేవో తేల్చుకోవాల్సిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించి విజయం సాధించారు. ఫలితంగా సూపర్-8కు దూసుకెళ్లారు. ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించి సూపర్-8పై ఎన్నో ఆశలు పెట్టుకున్న నెదర్లాండ్ జట్టు ఇంటిముఖం పట్టింది.

తొలుత బ్యాటింగ్‌లోనూ, అనంతరం బౌలింగ్‌తో నెదర్లాండ్స్‌ ఆశలను ఆవిరి చేసింది. అఫ్రిది, అజ్మల్‌ మ్యాజిక్‌ పాకిస్థాన్‌ విజయంలో కీలకభూమిక పోషించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 175/5 స్కోరు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 93 స్కోరుకే చేతులెత్తేసింది. కమ్రాన్‌ అక్మల్‌ (41)కు "మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌" అవార్డు లభించింది.

Share this Story:

Follow Webdunia telugu