Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్వంటీ-20 టోర్నీ: సఫారీల సునాయాస విజయం

ట్వంటీ-20 టోర్నీ: సఫారీల సునాయాస విజయం
FileFILE
ట్వంటీ-20 టోర్నీ సూపర్-8 మ్యాచ్‌లలో భాగంగా గురువారం ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు సునాయాస విజయాన్ని సాధించారు. గ్రూపు-ఇలో జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఏడు వికెట్ల చేడాతో విజయం ఢంకా మోగించింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 18.5 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసింది. సఫారీ బౌలింగ్ పకడ్బంధీగా ఉండటంతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్ పరుగుల చేయలేక తంటాలు పడ్డారు. దీంతో 18.5 ఓవర్లలో 111 పరుగులకు అలౌట్ అయ్యారు. ఆ జట్టులో ఓవై షా (38), కాలింగ్ వుడ్ (19), పీటర్సన్ (19)లు మాత్రమే రాణించారు.

ఆ తర్వాత స్పల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. కల్లీస్‌ అజేయ అర్థ సెంచరీతో (57 నాటౌట్‌) సునాయాస విజయాన్ని అందుకుంది. కల్లీస్‌కు తోడు గిబ్స్‌ (30) రాణించడంతో 3 వికెట్లను మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలోనే విజయం సాధించింది. అటు బౌలింగ్, బ్యాటింగ్‌లలో రాణించిన కల్లీస్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Share this Story:

Follow Webdunia telugu