Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్వంటీ-20 టోర్నీ: కివీస్‌పై నెగ్గిన దక్షిణాఫ్రికా

ట్వంటీ-20 టోర్నీ: కివీస్‌పై నెగ్గిన దక్షిణాఫ్రికా
ట్వంటీ-20 టోర్నీలో భాగంగా మంగళవారం కివీస్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో దక్షిణాఫ్రికా జట్టు విజయభేరీ మోగించింది. తొలుత బ్యాటింగ్‌లో తడబడినా.. తర్వాత బౌలింగ్ విభాగంలో రాణించి గెలుపును సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేసింది.

ఆ తర్వాత 129 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 127 పరుగులకే చాప చుట్టేసింది. కెప్టెన్‌ మెక్‌కల్లమ్ ‌(57), జాకబ్ ఓరమ్‌ (24 నాటౌట్‌) చివరిదాకా పోరాడినప్పటికీ.. జట్టుకు విజయాన్ని అందించలకే పోయారు.

సంక్షిప్త స్కోరు వివరాలు:
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 128/7
న్యూజిలాండ్‌: 20 ఓవర్లలో 127/5

Share this Story:

Follow Webdunia telugu