ఇంగ్లాండ్లో జరుగుతున్న ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్లో సూపర్ ఎయిట్ దశ నుంచి న్యూజిలాండ్ కూడా ఇంటిముఖం పట్టింది. శ్రీలంకతో మంగళవారం జరిగిన సూపర్ ఎయిట్ మ్యాచ్లో న్యూజిలాండ్ పరాజయం పాలైంది. దీంతో సెమీస్లో నాలుగో స్థానాన్ని శ్రీలంక కైవసం చేసుకుంది.
దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్ సెమీ ఫైనల్ బెర్తులు ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్పై చివరి సూపర్ ఎయిట్ మ్యాచ్లో శ్రీలంక 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ మొత్తం తొలుత బ్యాటింగ్లో, అనంతరం బౌలింగ్లో శ్రీలంక పైచేయి సాధించింది. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ మినహా ఎవరూ పదుల స్కోరు కూడా చేయలేకపోయారు.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. దిల్షాన్(48), జయవర్దనే (41 నాటౌట్) రాణించారు. తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. మెండీస్ (3/9) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు. ఉదన 2 వికెట్లు పడగొట్టాడు.