Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వైన్‌ప్లూ బారినపడి పది వేలమందికి పైగా మృతి

స్వైన్‌ప్లూ బారినపడి పది వేలమందికి పైగా మృతి
, శనివారం, 19 డిశెంబరు 2009 (12:54 IST)
ప్రపంచవ్యాప్తంగా గడగడలాడించిన స్వైన్‌ఫ్లూ మహమ్మారి వ్యాధి బారినపడి పదివేలమందికి పైగా మృతి చెందారు.

గడచిన ఎనిమిది నెలలుగా ప్రపంచవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 10,582కు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం వెల్లడించింది.

డిసెంబర్ 13 వరకు ప్రపంచంలోని 208కి పైగా దేశాలలో స్వైన్‌ఫ్లూ బారినపడి 10,582 మంది మృతి చెందినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

అంతకు మునుపు డిసెంబర్ ఆరవ తేదీన విడుదల చేసిన ప్రకటనలో ఈ వ్యాధిబారినపడి మృతి చెందిన వారి సంఖ్య 9,596 మందిగా ఉండందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu