Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'సర్వభూపాల' వాహనంపై ఊరేగనున్న శ్రీవారు

'సర్వభూపాల' వాహనంపై ఊరేగనున్న శ్రీవారు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. మంగళవారం రాత్రి పృథ్విలోని ప్రభువులందరూ తన అధీనంలోని వారే అని వెల్లడించే "సర్వభూపాల" వాహనంపై ఊరేగుతారు. అంతకుముందు ఉదయం కల్పవృక్ష వాహనంపై ఊరేగిన దేవదేవుడు భక్తులకు దర్శనిమిచ్చాడు. కన్నుల పండుగగా జరిగిన ఈ ఉత్సవానికి భక్తులందూ చూసి తరించారు.

ఏడుకొండలను ఎక్కి ఆ స్వామిని దర్శనం చేసుకున్నంత మాత్రం చేతనే సర్వపాపాలు తొలగుతాయి. కలియుగంలో ప్రజల ఆర్తిని బాపి, వారిని తరింప చేయటానికి శ్రీ మహా విష్ణువు వైకుంఠాన్ని వీడి వేంకటాచలాన్ని చేరి, అక్కడి ఆనంద నిలయ దివ్యవిమానం కింద కొలువై ఉన్నారు.

అందుకే తిరుమల క్షేత్రం భూలోక వైకుంఠమైనది. ఆ స్వామి నేడు మలయప్ప స్వామిగా భక్తులకు కనులారా దర్శనమిస్తున్నాడు. అధిష్ఠాన దైవం ప్రతినిధిగా వివిధ ఉత్సవ సమయాలలో విశేష పూజలను అందుకుంటూ, ఊరేగింపు సందర్భంగా అసంఖ్యాక భక్తుల వందనాలు, సమర్పణలు అందుకుంటూ వారి సాధక బాధకాలను ఓపిగ్గా వింటూ... తాను సదా అండగా ఉన్నానంటూ అభయాన్నిచ్చే స్వామి శ్రీ మలయప్ప స్వామి.

గర్భగుడి వరకూ వచ్చి తన దర్శనం చేసుకొన అవకాశం లేని వృద్ధులు, అస్వస్థులు, చిన్నపిల్లల కోసమై తానే స్వయంగా బయటకు వచ్చి ఊరేగుతూ దర్శన భాగ్యం ప్రసాదించే దివ్యమూర్తి మలయప్ప స్వామి.

Share this Story:

Follow Webdunia telugu