Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2016 ఒలింపిక్సే నా చివరి ఈవెంట్ : ఉస్సేన్ బోల్ట్ ప్రకటన

2016 ఒలింపిక్సే నా చివరి ఈవెంట్ : ఉస్సేన్ బోల్ట్ ప్రకటన
, శుక్రవారం, 9 అక్టోబరు 2015 (12:33 IST)
2016లో రియో కేంద్రంగా జరిగే వరల్డ్ అథ్లెటిక్సే తనకు చివరి ఈవెంట్ అని జమైకా చిరుత, స్ప్రింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ ప్రకటించాడు. రన్నింగ్ ట్రాక్‌పై పరుగుల పందెం ప్రారంభమైందని  కళ్లుమూసి కళ్లు తెరిచేలోపు లక్ష్యాన్ని చేరిపోయే ఉస్సేన్ బోల్డ్ రిటైర్మెంట్ వార్త ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. 
 
ఎప్పుడెప్పుడు పరుగుల సునామీని చూస్తామా అని ఆత్రుతతో ఎదురుచూసే ఉసేన్ బోల్ట్ ఫ్యాన్స్‌కు ఆయన రిటైర్మెంట్ చేదువార్తే. ఇప్పటివరకు అథ్లెటిక్స్ ప్రియులను అలరించిన బోల్ట్ 2016లో రియో కేంద్రంగా జరిగే వరల్డ్ అథ్లెట్లిక్ ఈవెంటే చివరిదని పునరుద్ఘాటించాడు.
 
వరల్డ్ అండ్ ఒలింపిక్ వంద, రెండొందల మీటర్ల ఛాంపియన్ అయిన ఉస్సేన్ బోల్ట్.. రియో స్పోర్ట్స్‌లో మెరుగ్గా రాణించేందుకు ప్రత్యేక కోచింగ్ తీసుకుంటున్నాడని తెలిసింది. కాగా రియో 2016 ఏర్పాట్లు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu