మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ను డిఫెండింగ్ ఛాంపియన్, భారత టీనేజ్ సంచలనం పివి సింధు నిలబెట్టుకుంది. ఈ సీజన్లో ఆమెకు ఇదే మొదటి టైటిల్. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో ఈ తెలుగు తేజం 21-12, 21-17 తేడాతో కిమ్ హ్యో మిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది.
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం సాధించిన సింధు ఫైనల్లో కిమ్ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంది. సెమీస్లో చైనాకు చెందిన ఏడో సీడ్ యు సన్పై గెలిచి, టైటిల్ను అందుకునే అవకాశాలు తనకే ఉన్నాయని పరోక్షంగా హెచ్చరికలు పంపిన కిమ్ ఫైనల్లో సింధును తీవ్రంగానే ప్రతిఘటించింది.
అయితే, సింధు చక్కటి ప్లేసింగ్స్, స్మాష్లతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, వరుస సెట్లలో విజయాన్ని నమోదు చేసింది.