భారత టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జా స్వచ్ఛభారత్ ఛాలెంజ్ చేసింది. టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, గోపిచంద్లకు ఆమె ఆహ్వానం పలికింది.
ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పిన ఆమె, తాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గోపీచంద్లను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది.