ఢిల్లీ వేదికగా ఈనెల 24 నుంచి 29వ తేదీ వరకు ఇండియా ఓపెన్ సిరీస్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పాల్గొని టైటిల్ను సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ సిరీస్లో సైనాతోపాటు ఇతర షట్లర్లు కశ్యప్, శ్రీకాంత్, సాయి ప్రణీత్, సిక్కిరెడ్డి, గుత్తా జ్వాల, రుత్విక శివాని, రితుపర్ణాదాస్ పాల్గొంటున్నారు.
2010లో చైనాయేతర క్రీడాకారుడు టినే బౌన్ (డెనార్క్) ప్రపంచ నెంబర్ వన్గా నిలిచాడు. సైనా, మారిన్లో ఎవరు నెంబర్ వన్గా నిలిచినా.. భారత్, స్పెయిన్లకు చెందిన మహిళలు ఆ ఘనతను సాధించడం తొలిసారే కానున్నది. ఈ ఏడాది సైనా, మారిన్లు రెండుసార్లు ముఖాముఖి తలపడ్డారు.
ఈ ఏడాది జనవరిలో సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ గోల్డ్లో మారిన్ను సైనా చిత్తు చేస్తే, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో సైనాపై మారిన్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ టోర్నీలో సైనా, మారిన్లకు ప్రపంచ నెంబర్ వన్ అవకాశాలు ఉండటంతో ఈ టోర్నీ మరింత ఆసక్తిగా మారింది.