భారతీయ బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించారు. ప్రపంచ మొదటి ర్యాంకును సాధించిన తొలి భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు పుటల్లో తన పేరును లిఖించుకున్నారు.
గతంలో పురుషుల్లో ప్రకాశ్ పదుకొనే మాత్రమే నెంబర్ వన్ పీఠం అధిష్టంచగలిగాడు. ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ సెమీస్లో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ ఓటమిపాలవడంతో అగ్రపీఠం సైనా వశమైంది. ఈ టోర్నీలో సైనా జపాన్ క్రీడాకారిణి యు హషిమొటోతో ఆడాల్సి ఉన్నా, ఈ మ్యాచ్తో పనిలేకుండానే నెంబర్ వన్ ర్యాంకు కైవసం అయింది.