బంగారు పతక విజేత తంగవేల్కు సూపర్ స్టార్ గ్రీటింగ్స్
రియో పారాలింపిక్స్ పురుషుల లాంగ్ జంప్లో బంగారు పతకాన్ని సాధించిన మారియప్పన్ తంగవేలుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.
రియో పారాలింపిక్స్ పురుషుల లాంగ్ జంప్లో బంగారు పతకాన్ని సాధించిన మారియప్పన్ తంగవేలుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. అలాగే, పురుషుల లాంగ్ జంప్ విభాగంలోనే కాంస్య పతకం సాధించిన భారత్ క్రీడాకారుడు వరుణ్ భాటికీ కూడా ఇదే ట్వీట్లో అభినందనలు తెలిపారు. కాగా, తమిళనాడు రాష్ట్రానికి చెందిన తంగవేలు స్వర్ణ పతకం సాధించడంపై తమిళ సినీ నటులు సూర్య, ధనుష్, శివ కార్తికేయన్ తదితరులు అభినందనలు తెలిపారు.
పారాలింపిక్స్ పోటీల్లో భాగంగా హైజంప్లో తమిళనాడుకు చెందిన మారియప్పన్ తంగవేలు స్వర్ణ పతకం సాధించి రికార్డు సృష్టించిన విషయం తెల్సిందే. దివ్యాంగుల కోసం జరిగే ఈ పారాలింపిక్స్ పోటీల్లో మారియప్పన్ బంగారు పతకంతో మెరిశాడు. 1.89 మీటర్ల హైజంప్ కేటగిరీలో మారియప్పన్ ఈ అరుదైన ఫీట్ను సాధించాడు. మారియప్పన్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితతో పాటు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఇంకా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మారియప్పన్కు రూ.75 లక్షల నగదును నజరానాగా అందించనుంది.