Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పీవీ సింధుకు ఘన స్వాగతం : సైనా కటీఫ్‌పై గోపీచంద్ స్పందన!

పీవీ సింధుకు ఘన స్వాగతం : సైనా కటీఫ్‌పై గోపీచంద్ స్పందన!
, మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (19:05 IST)
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన పివి సింధుకు శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. స్కాట్‌లాండ్ నుండి పివి సిందు, గోపీచంద్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో సింధుకు అభినందన కార్యక్రమం నిర్వహించారు.
 
క్వార్టర్‌ ఫైనల్‌లో రెండో సీడ్‌ షిజియాన్‌ వాంగ్‌పై సింధు గెలుపొందింది. గత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన పివి సింధు, వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు మెడల్స్‌ సాధించిన క్రీడాకారిణిగా సింధు రికార్డు నెలకొల్పింది.
 
కాగా.. సైనా నెహ్వాల్‌‌ అంశంపై గోపీచంద్ స్పందించారు. ప్రస్తుతం సింధు కాంస్యం సాధించిన ఆనందంలో ఉన్నానని... సైనా నెహ్వాల్ విషయం ఇప్పుడే ఎందుకని వ్యాఖ్యానించారు.
 
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో సైనా నెహ్వాల్‌ పతకం గెలవకుండానే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. క్వార్టర్‌ ఫైనల్‌లో సైనాపై టాప్‌ సీడ్‌ చైనా షెట్లర్‌ లీ జురుయ్‌ విజయం సాధించినా... రెండో గేమ్‌లో సైనా కాసేపు మెరుగ్గా అడినా లీ జురుయ్‌ ముందు నిలువలేకపోయింది. 
 
తరచూ ఓటములు వెంటాడటంతో కోచ్ మార్చేయాలని సైనా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా పుల్లెల గోపిచంద్‌తో కటీఫ్ అయ్యింది. వినయ్ కుమార్‌ను సైనా కోచ్‌గా స్వీకరించింది. 

Share this Story:

Follow Webdunia telugu