కొత్త వివాదంలో రియో స్టార్లు.. పీవీ సింధుకు కూడా కష్టాలు.. బ్రాండ్ దుస్తులు ధరించలేదని?
రియో ఒలింపిక్స్లో విజయపతాకం ఎగురవేసిన స్టార్లను కొత్త వివాదం వెంటాడుతోంది. బ్యాడ్మింటన్లో రజత పతకం సాధించిన పీవీ సింధు, జన హృదయాలను గెలిచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాండ్మ
రియో ఒలింపిక్స్లో విజయపతాకం ఎగురవేసిన స్టార్లను కొత్త వివాదం వెంటాడుతోంది. బ్యాడ్మింటన్లో రజత పతకం సాధించిన పీవీ సింధు, జన హృదయాలను గెలిచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాండ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీధర్ తమ బట్టలు ధరించలేదని, ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఓ ప్రముఖ దుస్తుల కంపెనీ ఆరోపిస్తుంది. రియో ఒలింపిక్స్లో భారత క్రీడాకారులందరూ తమ బ్రాండ్ దుస్తులనే ధరించాలన్న ఒప్పందంతో భారత ఒలింపిక్స్ సంఘానికి రూ.3 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని సదరు కంపెనీ చెప్పిందట.
పి.వి. సింధు, దీప, యోగేశ్వర్ దత్, శ్రీకాంత్త తమ బ్రాండ్ దుస్తులను కాకుండా ఇతర బ్రాండ్ల దుస్తులు ధరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై భారత్లో లీ నింగ్ బ్రాండ్ దుస్తుల డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తోన్న సన్లైట్ స్పోర్ట్స్ ప్రై. లిమిటెడ్ సంస్ధ ఎండీ మహేందర్ కపూర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత ఒలింపిక్ సంఘానికి లేఖ రాశారు. ఈ క్రీడాకారులకు వేరే కంపెనీల దుస్తులను ఇచ్చిన ఫెడరేషన్లకు భారత ఒలింపిక్ అసోసియేషన్ లేఖ రాసినట్లు తెలుస్తోంది.