ప్రపంచ షూటింగ్ చాంపియన్షిప్స్లో ఇప్పటి వరకూ పేలమైన ప్రదర్శనలతో నీరుగారిపోయిన భారత్కు ఊరట లభించింది. 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టోల్ ఈవెంట్లో యువ షూటర్ ప్రదీప్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ముగ్గురు సభ్యులతో కూడిన భారత జట్టు ఈ విభాగంలో నాలుగో స్థానంలో నిలవడంలో అతని కీలక పాత్ర పోషించాడు.
పురుషుల 50 మీటర్ల పిస్టోల్ ఈవెంట్లో జితూ రాయ్ రజత పతకాన్ని సాధించగా, ప్రదీప్ రెండో పతకాన్ని అందించాడు. స్టార్ షూటర్లు నిరాశ పరచగా ప్రదీప్ పతకం సాధించడం విశేషం.