Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లియాండర్ పేస్, సానియాను ఆదర్శంగా తీసుకుని రాణించాలి: మార్టినా హింగిస్

లియాండర్ పేస్, సానియాను ఆదర్శంగా తీసుకుని రాణించాలి: మార్టినా హింగిస్
, శనివారం, 28 నవంబరు 2015 (11:50 IST)
భారత టెన్నిస్‌కు లియాండర్ పేస్, సానియా మీర్జా రూపంలో ఇద్దరు స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారని.. సీనియర్లను ఆదర్శంగా తీసుకుని యువ క్రీడాకారులు టెన్నిస్‌లో రాణించాలని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి మార్టీనా హింగీస్ సూచించారు. 
 
ఆదివారం హైదరాబాద్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరుగనున్న సీటీఎల్ మ్యాచ్‌లో ఆడేందుకు వచ్చిన సందర్భంగా హింగిస్ మాట్లాడుతూ.. ప్రతి దేశంలోనూ టెన్నిస్‌లో స్ఫూర్తిని పెంచేందుకు అంతర్జాతీయ స్ధాయిలో ఆడే ఆటగాడు ఉండడం చాలా అవసరమన్నారు. 
 
అదృష్టవశాత్తు భారత్‌కు లియాండర్ పేస్, సానియా మీర్జా రూపంలో ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారని చెప్పారు. ఈ ఏడాది సీటీఎల్‌లో తమ జట్టు గెలుపును నమోదు చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సానియా, పేస్‌తో కలిసి విజయాలు సాధించడం గొప్పగా ఉందని ఆమె పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu