రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా, కేవలం ఒక సీజన్ తర్వాత చెక్ కోచ్ జాన్ జెలెజ్నీతో తన భాగస్వామ్యాన్ని ముగించినట్లు శనివారం ప్రకటించారు. ఈ భాగస్వామ్యం అభివృద్ధి, గౌరవం, క్రీడపై పరస్పర ప్రేమతో సాగిందని నీరజ్ చోప్రా పేర్కొన్నారు.
ఈ క్రీడలో ప్రపంచ రికార్డును సాధించిన దిగ్గజమైన జెలెజ్నీతో తన ప్రయాణాన్ని ముగించడానికి గల కారణాన్ని చోప్రా స్పష్టం చేయలేదు. ఆయన శిక్షణలోనే హర్యానాకు చెందిన నీరజ్ గత సంవత్సరం 90 మీటర్ల మార్కును అధిగమించాడు.
తమ సహకారం గురించి నీరజ్ చోప్రా మాట్లాడుతూ, చిన్నప్పటి నుండి తాను ఆరాధించే ఒక అథ్లెట్ నుండి నేరుగా నేర్చుకోవడం ఒక కల నెరవేరినట్లుగా ఉందని, అది తనకు వ్యాయామాలు, సాంకేతిక ఆలోచనలు, సరికొత్త దృక్ఫోణాలతో కూడిన ఒక సరికొత్త సాధనాల సముదాయాన్ని అందించిందని చెప్పాడు.