Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చీపురు పట్టి ఊడ్చిన సానియా : నరేంద్ర మోడీ అభినందనలు!

చీపురు పట్టి ఊడ్చిన సానియా : నరేంద్ర మోడీ అభినందనలు!
, శుక్రవారం, 17 అక్టోబరు 2014 (13:17 IST)
స్వచ్ఛ్ భారత్ కోసం రిలయన్స్ అధినేత అనిల్ అబానీ ఇచ్చిన సవాల్ స్వీకరించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చీపురు పట్టి ఊడ్చి చెత్త ఎత్తింది. హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లోని వీధులను ఊడ్చింది. సానియా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, షూటర్ అభినవ్ భింద్రాలను సానియా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.
 
ఇదిలావుడంగా, స్వచ్ఛ్ భారత్ కోసం వీధులు ఊడ్చిన సానియాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో భాగంగా గురువారం హైదరాబాద్‌లో చీపురు పట్టిన సానియా మీర్జా ఉత్సాహంగా రోడ్లు ఊడ్చారు. 
 
ఈ విషయం తెలుసుకున్న మోడీ, సానియాకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మోడీ ట్విట్టర్ లో సానియా మీర్జాను ఆకాశాకెత్తేశారు. సానియా మీర్జా చర్యలు స్వచ్ఛ్ భారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లనున్నాయి. సానియా మీర్జా భాగస్వామ్యంతో స్వచ్ఛ్ భారత్‌పై దేశవ్యాప్తంగా ప్రచారంతో పాటు అవగాహన పెరిగే అవకాశముందని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu