Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒలింపిక్స్ పోటీల తర్వాత రిటైర్మెంట్ : మేరీ కోమ్

ఒలింపిక్స్ పోటీల తర్వాత రిటైర్మెంట్ : మేరీ కోమ్
, మంగళవారం, 3 మార్చి 2015 (11:24 IST)
రియో డీ జెనీరోలో వచ్చే 2016లో జరుగనున్న ఒలింపిక్స్ పోటీల తర్వాత క్రీడలకు గుడ్‌బై చెప్పనున్నట్టు ఒలింపిక్ పతక గ్రహీత, ప్రముఖ భారతీయ మహిళా బాక్సర్ మేరీ కోమ్ ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ 'సుదీర్ఘకాలం బాక్సింగ్ ఆడి అలసిపోయా, ఒలింపిక్స్ తర్వాత క్రీడకు గుడ్ బై చెబుతానని 32 ఏళ్ల మేరీ కోమ్ వెల్లడించారు.  బాక్సింగ్ వంటి క్రీడను సుదీర్ఘకాలం కొనసాగించేందుకు తన వయసు కూడా అడ్డంకిగా మారుతుందన్నారు. అందుకే తాను విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నానని, ఒలింపిక్స్ తరువాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఆమె తెలిపారు. 
 
2016 రియో డీ జెనీరోలో జరగనున్న ఒలింపిక్స్ కోసం అవిశ్రాంతంగా ప్రాక్టీస్ చేస్తున్న ఆమె, ఇంత కాలం బాక్సింగ్ క్రీడలో కొనసాగడం తన అదృష్టమని ఇద్దరు పిల్లల తల్లి చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu