Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటర్నేషనల్ టోర్నీల్లో పాల్గొంటే రూ.3లక్షలు: కేసీఆర్ ఆఫర్

ఇంటర్నేషనల్ టోర్నీల్లో పాల్గొంటే రూ.3లక్షలు: కేసీఆర్ ఆఫర్
, శనివారం, 13 సెప్టెంబరు 2014 (13:57 IST)
ఇంటర్నేషనల్ టోర్నీల్లో పాల్గొనే క్రీడాకారుల ఖర్చుల కోసం రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. 
 
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో కాంస్యం సాధించిన పీవీ సింధును శుక్రవారం సచివాలయంలో సన్మానించిన సందర్భంగా.. భవిష్యత్తులో ఆమె పాల్గొనే అన్ని అంతర్జాతీయ క్రీడా పోటీలకు ప్రభుత్వం సాయమందిస్తుందని హామీ ఇచ్చారు. గతంలో ప్రకటించినట్లుగానే సింధుకు నగదు ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించారు. 
 
కాగా క్రీడాకారులకు సీఎం కేసీఆర్ అందిస్తున్న పోత్సాహానికి జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉన్నందున అంతర్జాతీయ స్థాయిలోమరింతగా రాణించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu