Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐఎస్ఎల్ : సచిన్ జట్టుపై సౌరవ్ గంగూలీ జట్టు విజయం!

ఐఎస్ఎల్ : సచిన్ జట్టుపై సౌరవ్ గంగూలీ జట్టు విజయం!
, ఆదివారం, 21 డిశెంబరు 2014 (12:05 IST)
ఇండియన్ ఛాంపియన్స్ లీగ్ టోర్నీ పేరిట భారత్‌లో నిర్వహించిన ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్‌లో భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జట్టు విజయభేరీ మోగించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో సచిన్ జట్టుపై గంగూలీ విజయం సాధించింది. ఇండియన్ ఛాంపియన్స్ లీగ్ (ఐఎస్ఎల్) పేరిట తొలిసారి భారత్‌లో జరిగిన ఫుట్ బాల్ టోర్నీలో పాల్గొన్న జట్లలో సచిన్ కేరళ జట్టును కొనుగోలు చేయగా, గంగూలీ సొంత జట్టు కోల్‌కతాను కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ రెండు జట్లు ఐఎస్ఎల్ ఫైనల్‌కు చేరుకున్నాయి. శనివారం జరిగిన ఫైనల్స్ మ్యాచ్‌లో సచిన్ సేన కేరళపై 1-0 తేడాతో గంగూలీ సేన కోల్‌కతా విజయం సాధించింది. 90 నిమిషాల ఫుట్ బాల్ ఆటలో రెండు జట్లు హోరాహోరీ పోరాడాయి. మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా మహ్మద్ రఫీక్ గోల్ చేసి కోల్‌కతాను విజయపథాన నిలిపాడు. 

Share this Story:

Follow Webdunia telugu