భారత హాకీ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీలో చుక్కెదురైంది. ఆస్ట్రేలియా భారత్ ఆశలకు గండికొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 2-4 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది. షూటర్ వి.ఆర్.రఘునాథ్, స్ట్రైకర్ మన్దీప్ సింగ్ చేసిన రెండు గోల్స్ ఆస్ట్రేలియా విజయానికి బాటలు వేశాయి.
ఆ జట్టు ఆటగాళ్లు ట్రెంట్ మిట్టన్, అరాన్ జాల్వేస్కీ, ఫ్లైన్ ఒగ్లీవీ ట్రిస్టీయన్ అద్భుతంగా రాణించి భారత జట్టును కట్టడి చేశారు. ఈ మ్యాచ్ విజయం ద్వారా ఆస్ట్రేలియా జట్టు 13 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా... భారత్ ఏడు పాయింట్లను సాధించింది.
ఇక బ్రిటన్- బెల్జియం జట్ల మ్యాచ్ తరువాత భారత జట్టు పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది. ఇక భారత్ ఫైనల్లోకి ప్రవేశించాలంటే.. బ్రిటన్-బెల్జియం జట్ల మధ్య జరిగే మ్యాచ్పై ఆధారపడి ఉంది.