Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్: ముగిసిన సైనా పోరు!

ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్: ముగిసిన సైనా పోరు!
, శుక్రవారం, 29 మే 2015 (15:50 IST)
ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి ప్రపంచ నెంబర్ వన్ బ్యాడ్మింటన్ స్టార్, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. చైనా క్రీడాకారిణులపై ఆధిపత్యం చెలాయించలేకపోయింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో సైనా 15-21, 13-21తో ఐదో సీడ్ షిజియాన్ వాంగ్ చేతిలో ఓటమిని చవిచూసింది. 
 
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టోర్నీలో అడుగుపెట్టిన సైనా నెహ్వాలో క్వార్టర్స్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. ఇక, సైనా ఓటమితో టోర్నీలో భారత్ ప్రస్థానం ముగిసినట్లైంది. పీవీ సింధు, జ్వాల-పొన్నప్ప, కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, గురు సాయిదత్ ఇప్పటికే ఈ టోర్నీ నుంచి పరాజయం పాలై.. ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu