భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్పై హాకీ ఇండియా కార్యదర్శి నరేంద్ర బాత్రా ఫైర్ అయ్యారు. కపిల్ దేవ్ ఓ అవకాశ వాది అని బాత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్హులను కాకుండా, అనర్హులను అర్జున అవార్డులకు ఎంపిక చేశారని కపిల్పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్కు ప్రపంచకప్ అందించిన కపిల్కు ఇది తగదని అన్నారు.
అర్జున అవార్డుల కమిటీకి సారథ్యం వహించిన కపిల్... అవార్డు ఎంపికలో ఏడు మంది హాకీ ఆటగాళ్లను విస్మరించారని ఆరోపించారు. ఈ ఏడు మంది కూడా అవార్డుకు అర్హులైన వారేనని బాత్రా వ్యాఖ్యానించారు.